ISRO | స్పేస్లో ఉన్న ఉపగ్రహాల సంఖ్యను భారత్ రాబోయే రోజుల్లో మూడురెట్లు పెంచుతుందని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ తెలిపారు. ప్రస్తుతం భారత్కు చెందిన శాటిలైట్లు ప్రస్తుతం 55 ఉన్నాయని పేర్కొన్నారు. ‘భారత అంతరిక్ష కార్యక్రమం- విజయాలు, సవాళ్లు, భవిష్యత్ దిశ’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. 2040 నాటికి భారత్ స్పేస్ టెక్నాలజీ, మౌలిక సదుపాయాల పరంగా ప్రపంచంలోని ఇతర దేశాలతో సమానంగా ఉంటుందన్నారు. ఈ ఏడాది ఇస్రో 12 లాంచ్ వెహికిల్ మిషన్లను ప్లాన్ చేస్తోందన్నారు. ఇందులో నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ (NISAR)ని భారత్ జీఎల్ఎల్వీ-ఎఫ్ 16 జులై 30న ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఇస్రో సొంతంగా ఇంటర్నేషనల్ స్పేషన్ సెంటర్ను నిర్మిస్తుందని తెలిపారు. తమకు సొంత ల్యాండింగ్ మిషన్ సైతం ఉందన్నారు. ప్రస్తుతం 55 భారత ఉపగ్రహాలు అంతరిక్షం నుంచి ప్రజలకు సేవలందిస్తున్నాయని.. రాబోయే మూడేళ్లలో వాటి సంఖ్య దాదాపు మూడురెట్లు పెరుగుతుందన్నారు. డిమాండ్ ఎక్కువగా ఉందని.. దాంతో కొత్త ఉపగ్రహాలను ప్రయోగించాల్సి ఉందన్నారు. ఇస్రో ఈ దిశగా పని చేస్తుందన్నారు.
భారత్ 2035 నాటికి పూర్తిస్థాయిలో అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తుందన్నారు. మొదటి మాడ్యూల్ను 2028లో కక్ష్యలో ఉంచనున్నట్లు తెలిపారు. అంతరిక్ష రంగంలో సంస్కరణలు తీసుకువచ్చే పని జరుగుతుందన్నారు. గతంలో ఇస్రో సర్వీస్ బేస్డ్ మోడల్లపై పని చేసిందని.. ఇప్పుడు వాణిజ్య అవకాశాలను వినియోగించుకోవాలనుకుంటుందన్నారు. చంద్రయాన్-3 విజయం తర్వాత భారత్తో జపాన్ భాగస్వామ్యం కావాలనే కోరికను వ్యక్తం చేసిందన్నారు. సంయుక్తంగా జాక్సాతో కలిసి చంద్రయాన్-5, లూపెక్స్ మిషన్పై కలిసి పని చేయనున్నట్లు తెలిపారు. ఉపగ్రహాన్ని కలిసే తయారు చేస్తున్నామని.. దాన్ని జపాన్ ప్రయోగిస్తుందన్నారు. చంద్రయాన్-3 ల్యాండర్ 1,600 కిలోలు, కొత్త ఈ కొత్త మిషన్ 6,600 కిలోలు బరువు ఉంటుందన్నారు. రాబోయే రెండేళ్లలు పెద్ద వార్తలు వింటారన్నారు. రాబోయే మూడు నెలల్లో ఇస్రో అమెరికా 6,500 కిలోల కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భారత్ రాకెట్ నింగిలోకి తీసుకెళ్తుందని చెప్పారు. శ్రీహరికోటలో మూడవ లాంచ్ప్యాడ్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.4వేలకోట్ల కోట్ల బడ్జెట్ను ఆమోదించిందని చెప్పారు. గగన్యాన్ మిషన్ కింద 2027 తొలి త్రైమాసికంలో భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని భావిస్తున్నది. ఇదిలా ఉండగా.. ఇస్రో ఇప్పటి వరకు 3.4దేశాలకు చెందిన 433 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. ఆయా దేశాలకు సొంతంగా సాంకేతిక లేకపోవడంతో వాటిని ఇస్రో ప్రయోగించింది. గత పదేళ్లలో ఇస్రో మొత్తం 518 ఉపగ్రహాలను ప్రయోగించిందని నారాయణన్ అన్నారు.