ఉత్తర్కాశీ : ఉత్తరాఖండ్ ఉత్తర్కాశీ సొరంగంలో సహయ చర్యలకు శుక్రవారం మళ్లీ అంతరాయం కలిగింది. డ్రిల్లింగ్ యంత్రానికి అవరోధం ఎదురు కావడంతో సాంకేతిక కారణాల వల్ల డ్రిల్లింగ్ ఆపేయాల్సి వచ్చింది. శుక్రవారం డ్రిల్లింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే ఈ పరిస్థితి ఏర్పడింది.
కూలిన శిథిలాల మార్గంలో 48.6 మీటర్ల మేర అధికారులు క్లియర్ చేశారు. మిగతా శిథిలాలను తొలగిస్తే లోపల చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది.