డెహ్రాడూన్, మే 26: మదర్సాలపై ఉత్తరాఖండ్ ప్రభు త్వం ఉక్కుపాదం మోపుతున్నది. ప్రభుత్వం నుంచి నిధులను పొందుతున్న మదర్సా లు రాష్ట్ర విద్యా సంస్థకు అనుబంధంగా (అఫీలియేషన్) పనిచేస్తున్నట్టు నమోదు చేసుకొని అనుమతి పొందాలని ఆదేశించింది. తమ ఆదేశాలను పట్టించుకోకుంటే నిధులను నిలిపివేస్తామని, మదర్సాలను మూసివేసేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మదర్సాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకోవడానికి త్వరలోనే దర్యాప్తును కూడా చేపడుతామని వెల్లడించింది.