డెహ్రాడూన్: దీపావళి పండుగ సందర్భంగా దేశంలోని ఆలయాలన్నీ దీపాలు, లైట్ షోల కాంతుల్లో దగదగ మెరుస్తున్నాయి. అయోధ్య మొదలు అన్ని ఆలయాలు దీప కాంతులను వెదజల్లుతున్నాయి. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం ( Kedarnath Temple ) కూడా నిండా పూలతో ముస్తాబయ్యింది. దీపావళి సందర్భంగా 800 కిలోల పూలతో ఈ ఆలయాన్ని అలంకరించారు. మంచు కొండల నడుమ నిండా పూలతో అలంకరించుకుని ఉన్న ఈ ఆలయం చూడముచ్చటగా కనిపిస్తున్నది.