డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మాజీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కిశోర్ ఉపాధ్యాయ ఇవాళ బీజేపీ పార్టీలో చేరారు. ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి 14వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో కిశోర్ కమలం పార్టీలో చేరారు. డెహ్రాడూన్లో జరిగిన కార్యక్రమానికి పలువురు నేతలు హాజరయ్యారు. ఉత్తరాఖండ్ను ముందుకు తీసుకువెళ్లాలన్న స్పూర్తితోనే బీజేపీలో చేరినట్లు ఆయన వెల్లడించారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురైందో కాంగ్రెస్ను ప్రశ్నించాలని కిశోర్ అన్నారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కిశోర్పై ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనపై ఆరేళ్ల సస్పెన్షన్ విధించింది. క్రమశిక్షణా చర్యల ఆధారంగా ఆయన్ను అన్ని పోస్టుల నుంచి తొలగించారు.