(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఐఎఫ్ఎస్ అధికారి రాహుల్ పోస్టింగ్ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీరును సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. సీఎం అయినంత మాత్రాన ఏదైనా చెల్లుబాటు అవుతుందని అనుకోవద్దని హెచ్చరించింది. సీఎం రాజేమీ కాదన్న న్యాయస్థానం.. మనం ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నామనుకోవద్దని గుర్తు చేసింది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది..
రాహుల్ అనే ఐఎఫ్ఎస్ అధికారి కార్బెట్ టైగర్ రిజర్వ్కు హెడ్గా ఉండేవారు. అయితే, పులులు సంచరించే అడవిలో అక్రమ నిర్మాణాలు, చెట్ల నరికివేతకు అనుమతించారన్న ఆరోపణలతో రెండేండ్ల కిందట ఆయన్ని పదవీచ్యుతుణ్ని చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పుడు అదే రాహుల్ను రాజాజీ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్గా ధామీ నియమించారు.దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.