డెహ్రాడూన్: ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ముసాయిదాను ఉత్తరాఖండ్ క్యాబినెట్ ఆదివారం ఆమోదించింది. దీంతో ఈ బిల్లును సోమవారం నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం అయింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ యూసీసీ నివేదికను సీఎం పుష్కర్సింగ్ ధామికి శుక్రవారం సమర్పించింది. దీనిని ఆమోదించేందుకే శాసనసభ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారు.