లక్నో: శీతాకాలం వచ్చిందంటే చాలు మన దేశంలో వివిధ రకాల వలస పక్షులు సందడి చేస్తుంటాయి. ఆయా దేశాల్లోని వేసవితాపాన్ని తాళలేక వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వివిధ దేశాల నుంచి వలస పక్షులు భారత్కు చేరుకుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలోగల బ్రిజ్ఘాట్కు సైబీరియన్ జాతి వలస పక్షులు వచ్చాయి.
ఏడాదిలో కేవలం ఇలాంటి ప్రత్యేక సీజన్లో మాత్రమే కనిపించే ఈ సైబీరియన్ పక్షులను చూసి స్థానికులు, బ్రిజ్ఘాట్లోని వివిధ ఆలయాలకు వచ్చే యాత్రికులు ఎంజాయ్ చేస్తున్నారు. పవిత్ర గంగానదిలో సైబీరియన్ పక్షుల విన్యాసాలను ఆస్వాదిస్తున్నారు. ఈ కింది వీడియోలో ఆ పక్షులను చూసి మీరు కూడా కాసేపు ఆనందించండి.
Uttar Pradesh| Siberian birds flock to Brijghat, Hapur after flying over thousands of kilometres pic.twitter.com/Gu3ihH7VRl
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 16, 2023