లక్నో: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో స్కూళ్లను ఫిబ్రవరి 15వ తేదీ వరకు మూసివేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆన్లైన్ క్లాసులను కొనసాగించనున్నారు. కోవిడ్ పై పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ఆదేశంలో పేర్కొన్నారు. ఆ రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి అవనీశ్ అవాస్తీ ఆ ఆదేశాలను జారీ చేశారు. గతంలో జనవరి 30 వరకు స్కూళ్లను మూసివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. సెకండరీ బోర్డు పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసులను కొనసాగిస్తున్నట్లు అవాస్తీ చెప్పారు. బుధవారం రోజున యూపీలో పది వేల కేసులు నమోదు అయ్యాయి.