లక్నో: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ధరలు పెంచింది. ఇంధన సర్దుబాటు ఛార్జీ విధానం కింద అదనపు సర్ఛార్జ్ విధించాలని ఉత్తర ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయించింది. దీంతో జూన్ నెల నుంచి కరెంట్ బిల్లులు పది శాతం మేర పెరుగనున్నాయి. (UP hikes electricity prices) విద్యుత్ పంపిణీ సంస్థలకు పెరిగిన ఇంధనం, విద్యుత్ కొనుగోలు ఖర్చులను భర్తీ చేయడానికి అదనపు సర్ఛార్జ్ విధిస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ఇంధన సర్దుబాటు ఛార్జ్ విధానం ద్వారా ఇంధన ఖర్చులు, విద్యుత్ కొనుగోలు వ్యయాలలో వచ్చే హెచ్చుతగ్గులను వినియోగదారుల నుంచి తిరిగి రాబట్టుకోనున్నట్లు వివరించారు.
కాగా, ఇంధన సర్దుబాటు ఛార్జీ విధానం కింద అదనపు సర్ఛార్జ్ విధించనుండటంతో ఉత్తర ప్రదేశ్లోని విద్యుత్ వినియోగదారులు అధిక విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో జూన్ నెల నుంచి కరెంట్ బిల్లులు సుమారు పది శాతం మేర పెరుగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులపై ఆర్థిక భారం పడనున్నది.