లక్నో: కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ లడ్ కీ హూన్, లడ్ సక్తీ హూన్ (బాలికను, పోరాటమూ చేయగలను) పేరుతో నిర్వహిస్తున్న బాలికల మారథాన్ను వాయిదా వేసింది. యూపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నోయిడా, వారణాసితోపాటు ఇతర జిల్లాల్లో ఏడు నుంచి ఎనిమిది మారథాన్ ర్యాలీలు నిర్వహించాలాని నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం బరేలీలో తొలి మారథాన్ ర్యాలీ జరిగింది. అయితే గత నాలుగైదు రోజుల నుంచి కొవిడ్ కొత్త కేసుల సంఖ్య అంతకంతకే పెరిగిపోతుండటంతో మారథాన్ ర్యాలీల నిర్వహణను తాత్కాలికంగా వాయిదా వేసింది.