లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్.. యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పార్థివదేహానికి నివాళులర్పించారు. ములాయం భౌతికకాయంపై పుష్పగుచ్ఛాన్నుంచి అంజలి ఘటించారు. అనంతరం ములాయం తనయుడు, యూపీ మరో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను ఓదార్చారు.
ములాయం పార్థివదేహం ఆయన స్వగ్రామం సాయ్ఫాయ్కి చేరుకోకముందే యోగీ ఆదిత్యనాథ్ అక్కడికి వెళ్లారు. పార్టీవదేహం ఇంటికి చేరగానే పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు ములాయం మరణవార్త తెలియగానే యోగీ ఆదిత్యానాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన అంత్యక్రియలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని ప్రకటించారు.