లక్నో: ఉత్తరప్రదేశ్లో ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య సమాజ్వాదీ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. మంగళవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ నెల 22న కొత్త పార్టీని ప్రకటిస్తానని తెలిపారు.
ప్రసాద్ మౌర్య 2022 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీని వీడి ఎస్పీలో చేరారు. అయోధ్యలో రామాలయం, రామ్చరిత్ మానస్పై స్వామి ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.