Uttar Pradesh | లక్నో, అక్టోబర్ 24: యూపీలోని ఒక ప్రభుత్వ దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యం 14 మంది బాలబాలికల ప్రాణాలమీదకు తెచ్చింది. రక్త నిర్ధారణ పరీక్షలు నిర్లక్ష్యంగా చేయడంతో తలసేమియాకు చికిత్స పొందుతున్న ఆరు నుంచి 16 ఏండ్ల లోపు 14 మంది బాలబాలికలు హెచ్ఐవీ, హెపటైటిస్ లాంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడ్డారు.
వీరిలో ఆరుగురికి హెపటైటిస్ బీ, ఆరుగురికి హెపటైటిస్ సీ, ఇద్దరికి హెచ్ఐవీ సోకింది. సరైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకుండా వీరికి రక్తం ఎక్కించడం వల్ల వీరికి ఈ పరిస్థితి ఏర్పడినట్టు కాన్పూర్లోని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే లాలా లజపతి రాయ్ దవాఖానలో చోటుచేసుకుంది.