న్యూఢిల్లీ: నకిలీ మందులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం మందులపై బార్కోడ్ తప్పనిసరి చేసింది. 300 డ్రగ్ ఫార్ములేషన్స్పై కంపెనీలు బార్కోడ్ ముద్రించాల్సి ఉంటుంది. ఇది 2023 ఆగస్టు 1నుంచి అమల్లోకి వస్తుంది.
దీన్ని మెడిసిన్స్ ఆధార్కార్డుగా పరిగణిస్తున్నారు. ఈ బార్కోడ్లో మాన్యుఫ్యాక్చరింగ్ లైసెన్స్, చిరునామా, తేదీ, బ్యాచ్ నంబర్, డ్రగ్ జనరిక్ పేరు, కంపెనీ పేరు, గడువు తేదీలాంటి వివరాలను కంపెనీలు పొందుపర్చాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కువగా అమ్ముడుపోయే అల్లెగ్రా, డోలో, అగ్మెంటిన్, సారిడాన్, కాల్పోల్, థైరోనార్మ్లాంటి మందులు ఉన్నాయి.