న్యూఢిల్లీ: వీసాల జారీలో భారత్లోని అమెరికా ఎంబసీ 10 లక్షల మైలురాయిని దాటింది. ఈ ఏడాది జారీ చేసిన వివిధ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల సంఖ్య 10 లక్షలకు చేరుకున్నట్టు అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది.
భారతీయలకు పది లక్షల వీసాలను మంజూరు చేయాలన్న తమ మిషన్ 1 మిలియన్ గురువారంతో పూర్తయినట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా డాక్టర్ రంజు సింగ్ దంపతులకు 10 లక్షల మైలురాయి వీసాను యూఎస్ అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి అందజేశారు. భారతీయులకు మరిన్ని వీసాలు మంజూరు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.