బాలాసోర్: యూపీఎస్సీ ద్వారా నియమితులైన అధికారులను ఉద్దేశించి కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ టుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గల బలియాపాల్లో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన స్వర్ణోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా టుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘యూపీఎస్సీ ద్వారా నియమితులైన వారు చాలా జ్ఞానవంతులని నాకు తెలుసు. వారు ఎప్పుడూ పెద్ద స్థానాల్లో ఉంటారు. కానీ, వారు దోపిడీ దొంగలు అని నాకు అనిపిస్తున్నది.
100 శాతం మంది ఇలాంటి వారే అని చెప్పలేను కానీ చాలావరకు దోపిడీ దొంగలే’ అని పేర్కొన్నారు. ఢిల్లీలో యూపీఎస్సీ కార్యాలయం తన ఇంటి పక్కనే ఉంటుందని, మొదట్లో దానిపైన తనకు సదభిప్రాయం ఉండేదని, ఇప్పుడు మారిపోయిందన్నారు. విద్యావంతులు అధికారులుగా ఉన్నప్పుడు సమాజంలో అవినీతి, అన్యా యం ఎందుకు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. విద్యావ్యవస్థలో నైతికత కొరవడటం, ఆధ్యాత్మిక విద్య, భావా లు కొరవడటమే ఇందుకు కారణమని ఆయనే సమాధానమిచ్చుకున్నారు.