సివిల్ సర్వీస్ సాధించాలని చాలామంది కలలు కంటారు. డిగ్రీ అయిపోగానే ఢిల్లీ బాటపడుతారు. దేశ రాజధానిలో కోచింగ్ తీసుకుంటూ యూపీఎస్సీ పరీక్షలకు హాజరవుతుంటారు. అయితే, అందులో కొంతమంది మాత్రమే లక్ష్యాన్ని సాధిస్తారు. సివిల్ సర్వెంట్లుగా ఎంపికవుతారు. మిగతావారు ఏళ్లతరబడి పోరాడుతూనే ఉంటారు. అయినా, ఎంపిక కాలేకపోతారు. 11 ఏళ్లుగా ప్రిపేరై 5 సార్లు యూపీఎస్సీ పరీక్షలకు హాజరైనా సివిల్స్ సాధించలేకపోయిన ఓ వ్యక్తి ఇచ్చిన ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ అవుతోంది.
బీహార్లోని గోపాల్గంజ్ నివాసి అయిన హరేంద్ర పాండే డిగ్రీ అయిపోగానే యూపీఎస్సీ పరీక్షలకు కోచింగ్ తీసుకునేందుకు ఢిల్లీకి చేరుకున్నాడు. 11 ఏండ్లు కష్టపడ్డాడు. ఐదుసార్లు సివిల్స్ రాశాడు. నాలుగు సార్లు మెయిన్స్ పరీక్షలు కూడా రాశాడు. అయినా అతడిని విజయం వరించలేదు. తన గర్ల్ఫ్రెండ్ మాత్రం ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయింది. ఈ విషయాలను హరేంద్రపాండే ఓ యూట్యూబర్తో పంచుకున్నాడు. ప్రిపరేషన్ సమయంలో తాను చేసిన పొరపాట్లను నిజాయితీగా ఒప్పుకున్నాడు. విజయం సాధించిన తర్వాత మనుషులు మారిపోతున్నారని బాధపడ్డాడు. తన గర్ల్ఫ్రెండ్ ఐఏఎస్ అవ్వగానే ఫోన్ నంబర్ చేంజ్ చేసిందని, ఇంతవరకూ తనతో మాట్లాడలేదని బాధపడ్డాడు. ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతున్నది. హరేంద్ర దృఢ సంకల్పం, నిజాయితీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.