భువనేశ్వర్, ఏప్రిల్ 16: జీవితంలో అత్యంత ప్రధాన ఘడియలలో విధి విషాదాన్ని మిగిల్చినా, దానిని దిగమింగుకుని మొక్కవోని పట్టుదలతో అనుకున్న లక్ష్యా న్ని సాధించాడు ఒడిశాకు చెందిన 24 ఏండ్ల అనిమేశ్ ప్రధాన్. మంగళవారం ప్రకటించిన సివిల్స్ పరీక్షలో రెండో స్థానంలో నిలిచి భేష్ అన్పించుకున్నాడు.
తొమ్మిదేళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న అనిమేశ్ సరిగ్గా సివిల్స్ ఇం టర్వ్యూ సమయంలో క్యాన్సర్తో బాధపడుతున్న తల్లి కన్నుమూసింది. అంతటి విషాద స్థితిలోనే బాధను భరిస్తూ లక్ష్య సాధన దిశగా సాగిపోయాడు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించడమే కాక, దేశంలోనే రెండో స్థానంలో నిలిచా డు. అనుగుల్ జిల్లా తాల్చేర్కు చెందిన ప్రధాన్ కేంద్రీయ విద్యాలయంలో అనిమేశ్ చదివాడు. రూర్కెలాలోని ఎన్ఐటీ లో కంప్యూటర్ ఇంజినీరింగ్ చేశాడు.