రాంపూర్ (యూపీ), ఫిబ్రవరి 13: ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపర్చాలని యూపీలోని రాంపూర్ ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ఎస్పీని ఆదేశించింది. ఒక కేసులో నాన్బెయిల్ వారెంట్ ఉన్నా సోమవారం ఆమె హాజరు కాకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇంతకుముందు ఆమెపై ఏడుసార్లు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయినా న్యాయస్థానానికి గైర్హాజరయ్యారు. దాంతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని, ఆమెను అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపర్చాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి దాఖలైన రెండు కేసుల్లో ఇప్పటికే జయప్రద పరారీలో ఉన్నారు. వివాదాలకు జయప్రద కొత్తేమీ కాదు. గతంలో కూడా ఒక కేసులో చెన్నై కోర్టు ఆమెకు ఆరు నెలల జైలు, 5వేల జరిమానా విధించింది.