లక్నో: శివలింగం వద్ద పూజలు చేసిన బీజేపీ మంత్రి అనంతరం అక్కడే చేతులు కడిగారు. (UP Minister Wash Hands At Shivling) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన సనాతన ధర్మాన్ని ఉల్లంఘించారని ప్రతిపక్షాలు విమర్శించాయి. మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ఆగస్ట్ 27న ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి సతీష్ శర్మ, పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి జితిన్ ప్రసాద్తో కలిసి బారాబంకిలోని లోధేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పూజలు చేశారు. పూజ అనంతరం శివలింగం వద్దనే చేతులు కడిగారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ మంత్రి సతీష్ శర్మ శివలింగం ఉన్న చోటే చేతులు కడుగడాన్ని ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. ఆయన సనాతన ధర్మాన్ని అవమానించారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ విమర్శించారు. శివుడ్ని అవమానించిన ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని మరో కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్పుత్, సమాజ్వాదీ పార్టీ నేత సునీల్ సింగ్ సాజన్ డిమాండ్ చేశారు.
మరోవైపు తనపై వచ్చిన విమర్శలను బీజేపీ మంత్రి సతీష్ శర్మ ఖండించారు. తాను సనాతన ధర్మాన్ని పాటించే శివ భక్తుడినని తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదని మీడియాకు వెల్లడించారు. తాను చేసింది తప్పు అయితే చేతులు కడుక్కునేందుకు పూజారి తన చేతిపై నీళ్లు పోసేవారు కాదని అన్నారు.
उत्तर प्रदेश सरकार के मंत्री सतीश शर्मा शिवालय में शिवलिंग के अर्घ्य से सटाकर ही हाथ धो रहे हैं।
बगल में एक और मंत्री जितिन प्रसाद खड़े होकर टकटकी निगाह से देख रहे हैं।
धर्म के नाम पर, देवी-देवताओं के नाम पर राजनीति करने वाले और कुर्सी पर बैठने वाले इन नीचों के पास इतनी… pic.twitter.com/VD43Fw3YAB
— UP Congress (@INCUttarPradesh) September 3, 2023