లక్నో: ప్రధానమంత్రి ఆవాస్ కోసం లంచం ఇచ్చినట్లు ఒక మహిళ ఆరోపించింది. (Bribe For PM Awas) మైక్లో బహిరంగంగా ఈ విషయాన్ని చెప్పింది. ఇది విని వేదికపై ఉన్న బీజేపీ నేతలు షాకయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. గురువారం బుదౌన్లో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు.
కాగా, లబ్ధిదారురాలైన ఒక మహిళతో స్థానిక బీజేపీ ఎంపీ ధర్మేంద్ర కశ్యప్ మాట్లాడారు. ‘నీకు ఇల్లు వచ్చిందా లేదా’ అని మైక్లో ఆమెను అడిగారు. దానికి అవునని వృద్ధురాలు బదులిచ్చింది. ఇంటి కోసం ఏదైనా డబ్బు చెల్లించాలా అని ఆ ఎంపీ అడిగారు. మొదట లేదన్న ఆమె తర్వాత అవునని చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇంటిని పొందేందుకు రూ.30,000 లంచంగా ఇచ్చినట్లు బహిరంగంగా వెల్లడించింది. వేదికపై ఉన్న బీజేపీ నేతలు ఇది విని నోరెళ్లబెట్టారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
BJP सांसद : घर मिला है, किसी ने पैसे तो नहीं लिए?
वृद्धा : हां लिए हैं, 30 हजारVideo उत्तर प्रदेश में जिला बदायूं की है। कार्यक्रम का नाम था "विकसित भारत संकल्प यात्रा" और बात हो रही थी "PM आवास योजना" की। pic.twitter.com/w2a75cQH0r
— Sachin Gupta (@SachinGuptaUP) January 19, 2024