న్యూఢిల్లీ: ప్రతి పోక్సో కేసు నేరంలో ముగ్గురు నిర్దోషులుగా బయటపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. చిన్న పిల్లలపై అఘాయిత్యాలను నిరోధించడానికి పోక్సో చట్టాన్ని తీసుకొచ్చి 10 ఏండ్లు అవుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనం జరిగింది. ఈ నేరాలపై దర్యాప్తు జరిపి, నిందితులకు శిక్ష పడేలా చూడటంలో యూపీ చాలా వెనుకబడి ఉన్నది. 2012 నుంచి 2021 వరకు నమోదైన పోక్సో కేసుల్లో దాదాపు మూడో వంతు కేసులు (77.77%) పెండింగ్లోనే ఉన్నాయి. పనికిరాని కేసులంటూ మూసివేసిన వాటిలో తమిళనాడు తొలిస్థానంలో ఉంది.