ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో (Prayagraj) ఓ కండక్టర్పై ఇంజినీరింగ్ విద్యార్థి దాడికి పాల్పడ్డాడు. ఇంజినీరింగ్ విద్యార్థి లారెబ్ హష్మి (Lareb Hashmi) కాలేజీకి వెళ్లడానికి బస్సు ఎక్కాడు. టికెట్ విషయంలో బస్సు కండక్టర్ హరికేశ్ విశ్వకర్మతో (Harikesh Vishwakarma) మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. సహనం కోల్పోయిన అతడు పదునైన ఆయుధంతో కండక్టర్ మెడపై దాడిచేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని దవాఖానకు తరలించారు. కాగా, హష్మి బస్సులోనుంచి పరారయ్యాడు. కాలేజీకి చేరుకున్న అతడు రెండు వీడియోలు రూపొందించాడు. మహ్మద్ ప్రవక్తను (Prophet Muhammad) దూషించినందుకే దాడిచేసినట్లు వాటిలో పేర్కొన్నాడు. కాగా, నరేంద్ర మోదీ, యోగీ ఆదిత్యనాథ్ కూడా దాడికి కారణమని చెప్పాడు.
బస్సులో ఒక్కసారిగా దాడి జరిగిందని, శబ్ధం విన్నతర్వాత బస్సును వెంటనే ఆపినట్లు బస్సు డ్రైవర్ మంగ్లా యాదవ్ చెప్పారు. విశ్వకర్మను దవాఖానకు తరలించినట్లు వెల్లడించారు. దాడికి సంబంధించి సమాచారం అందున్న పోలీసులు.. నిందితుడు హష్మిని అరెస్టు చేశారు.