లక్నో: బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. నర్సు ఒక మహిళా రోగి జుట్టుపట్టుకుని బెడ్పైకి తోసింది. సీతాపూర్ జిల్లా ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 18న ఒక మహిళా రోగిని వార్డులో అడ్మిట్ చేశారు. ఆమె కుటుంబ సభ్యులు లేని సమయంలో ఆ మహిళ పట్ల నర్సులు దురుసుగా ప్రవర్తించారు. ఆమె జుట్టు పట్టుకుని బెడ్పైకి తోశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, మహిళా రోగి పట్ల నర్సు ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్కే సింగ్, ఈ చర్యను సమర్థించారు. అర్ధరాత్రి వేళ ఆ మహిళా రోగి వింతగా ప్రవర్తించిందని తెలిపారు. దీంతో ఆమెను నియంత్రించేందుకు నర్సులు అలా చేయాల్సి వచ్చిందన్నారు. ఆమెకు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత సాధారణ పరిస్థితికి వచ్చిందని చెప్పారు. అనంతరం ఆ మహిళను డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు.
Video: UP Nurse Grabs Woman Patient By Her Hair, Pins Her Down https://t.co/L7qmPBCqDG pic.twitter.com/Rp5gJU9t5J
— NDTV (@ndtv) October 28, 2022