కాన్పూర్, ఆగస్టు 8: ఓ కేసులో దోషిగా తేలిన అనంతరం కోర్టు నుంచి పారిపోయిన ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని మంత్రి రాకేశ్ సచన్ సోమవారం స్థానిక కోర్టులో లొంగిపోయారు. దీంతో 1991లో నమోదైన ఆయుధాల చట్టం కేసులో న్యాయస్థానం ఆయనకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.1,500 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అనంతరం రూ.50 వేల పూచీకత్తుపై రాకేశ్ సచన్ బెయిల్ పొందారు. అక్రమంగా తుపాకీ కలిగివున్నాడని రాకేశ్ సచన్పై 1991, ఆగస్టులో కేసు నమోదైంది. ఈ కేసులో రాకేశ్ను కాన్పూర్ కోర్టు శనివారం దోషిగా తేల్చింది. తర్వాత ఉత్తర్వుల కాపీతో రాకేశ్ సచన్ అక్కడి నుంచి పారిపోయారు. మంత్రి పరారీపై కోర్టు అధికారులు పొలీసులకు ఫిర్యాదు చేశారు. రాకేశ్ సచన్ ప్రసుత్తం యోగి క్యాబినెట్లో ఎంఎస్ఎంఈ, ఖాదీ శాఖల మంత్రిగా ఉన్నారు.