లక్నో: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఓ హోటల్పై పోలీసులు తనిఖీ చేయడం వల్ల ఓ వ్యాపారవేత్త మృతిచెందాడు. ఆ ఘటనలో యోగి సర్కార్ ఆరుగురి పోలీసులపై వేటు వేసింది. పోలీసులు దాడి చేయడం వల్లే తన భర్త చనిపోయినట్లు ఆ వ్యాపారవేత్త భార్య ఆరోపించింది. హోటల్ రూమ్లో వ్యాపారవేత్త మనీష్ కుమార్ గుప్తా మృతిచెంది ఉన్నట్లు పోలీసులు చెప్పారు. కాన్పూర్కు చెందిన మనీశ్ ఓ పని నిమిత్తం గోరఖ్పూర్కు వచ్చాడు. అక్కడ అతన్ని కలిసేందుకు మరో ఇద్దరు హోటల్కు వచ్చారు. వాళ్లు రాత్రి ఓ హోటల్లో బస చేశారు. అయితే అర్థరాత్రి ఆ హోటల్కు తనిఖీ కోసం పోలీసులు వెళ్లారు. పోలీసులు వాళ్ల ఐడీలను చెక్ చేశారు. మనీశ్ను పోలీసులు చితకబాదినట్లు మరో వ్యక్తి తెలిపాడు. తాగిన మైకంలో పోలీసులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మనీశ్ ముఖంపై గాయాలు ఉన్నట్లు ఓ వ్యక్తి తెలిపాడు. హోటల్లో అనుమానాస్పద వ్యక్తులు ఉన్నట్లు సమాచారం రావడం వల్ల తనిఖీలు చేసినట్లు గోరఖ్పూర్ పోలీసులు చెప్పారు. మనీశ్ మృతిచెందడానికి 10 నిమిషాల ముందే ఫోన్లో తనతో మాట్లాడినట్లు అతని భార్య మీనాక్షి గుప్తా తెలిపారు.