ప్రతాప్గఢ్ (యూపీ), సెప్టెంబర్ 13: ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంకు నుంచి భారీ మొత్తంలో రుణం పొందాడో బీజేపీ నేత. ఈ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో చోటుచేసుకొన్నది. తన మేనమామ, బీజేపీ నేత అయిన రవి ప్రతాప్సింగ్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు నుంచి రూ.1.62 కోట్ల రుణం పొందినట్టు ఐఏఎస్ అధికారి అభయ్సింగ్ చీటింగ్ కేసు పెట్టారు.
బ్యాంకు అధికారుల విచారణతో ఐఏఎస్ అధికారి సంతకం ఫేక్ అని తేలటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని సోమవారం అరెస్టుచేసి రిమాండ్కు పంపినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. రవి ప్రతాప్సింగ్ యాక్టివ్ పార్టీ లీడర్ అని బీజేపీ కాశీ రీజినల్ యూనిట్ సభ్యుడు, పార్టీ సీనియర్ నేత గిరిధారి సింగ్ తెలిపారు. కానీ, కేసు విషయంలో మాట్లాడేందుకు నిరాకరించారు.