ఝాన్సీ(యూపీ): చేతి పంపులో నీళ్లకు బదులు మద్యం రావడంతో యూపీ పోలీసులు కంగుతిన్న అసాధారణ ఘటన ఝాన్సీకి సమీపంలోని పరగణా గ్రామంలో ఇటీవల చోటు చేసుకుంది. పోలీసుల సాయంతో ఎక్సైజ్ అధికారులు ఆ గ్రామంలో దాడి చేసినప్పుడు ఈ గుట్టు రైట్టెంది.
గ్రామంలోని కబుత్రా దేరా ప్రాంతలో ‘విభిన్నంగా’ ఉన్న చాలా చేతి పంపులను చూసి ఎక్సైజ్ అధికారులకు అనుమానం వచ్చింది. వాటిని కొట్టి చూస్తే నీళ్లకు బదులు మద్యం రావడంతో అవాక్కవడం వారి వంతైంది. భూగర్భంలో లిక్కర్ పీపాలు ఉంచి చేతి పంపుల ద్వారా సులువుగా, ఎవరికీ అనుమానం రాకుండా మద్యాన్ని అమ్మవచ్చని లిక్కర్ మాఫియా భావించిందని పోలీసులు తెలిపారు. 500 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు.