దుండగుల కాల్పుల్లో పోలీస్ అధికారి మృతి
ఇంఫాల్: మణిపూర్లో హింసాకాండ కొనసాగుతున్నది. బుధవారం చురాచంద్పూర్ జిల్లాలో దుండగుల కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మంగళవారం కాంగ్పోంగ్పీ జిల్లాలో ముగ్గురు గిరిజనులను దుండగులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. మణిపూర్లో గత మే నెలలో జాతుల మధ్య ఘర్షణలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 180 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు.