తిరువనంతపురం: బ్రెయిన్ ట్యూమర్ చికిత్సలో సరికొత్త మార్పు తీసుకొచ్చేలా కాలిఫోర్నియా యూనివర్సిటీలోని శాన్ఫ్రాన్సిస్కో మెడికల్ సెంటర్ సరికొత్త ఆవిష్కరణ చేసింది. జ్ఞాపకశక్తిని వేగంగా దెబ్బతీసి చావుకు కారణమయ్యే క్యాన్సర్ కణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
యాంటీ సీజర్ డ్రగ్ ట్యూమర్ సెల్స్ హైపరాక్టివిటీని తగ్గించడంతోపాటు వాటి పెరుగుదలను నియంత్రిస్తుందని తిరువనంతపురానికి చెందిన శాస్త్రవేత్త సరితా కృష్ణ నేతృత్వంలోని బృందం గుర్తించింది. సంబంధిత అధ్యయనం ‘నేచర్’లో ప్రచురితమైంది.
గ్లియోబ్లాస్టోమాతో బాధపడే రోగులకు ఈ ప్రయోగం ప్రయోజనకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రెయిన్ సర్క్యూట్ను సవరించడం ద్వారా గ్లియోమా రోగుల్లో మెదడు కార్యకలాపాల క్షీణతకు కారణమయ్యే మునుపు తెలియని మెకానిజాన్ని సరితాకృష్ణ, సహచర శాస్త్రవేత్త షాన్ హార్వీ-జంపర్ గుర్తించారు.