న్యూఢిల్లీ, జూలై 16: నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి తీసుకొచ్చిన చీతాల మరణాలపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఓ ప్రకటన చేసింది. 20 పెద్ద చీతాల్లో ఐదు సహజ కారణాలతోనే మరణించాయని, మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని పేర్కొన్నది.
చీతాల మెడకు ‘రేడియా కాలర్’ను వినియోగించడం వలన సోకిన ఇన్ఫెక్షన్ గాయాల కారణంగా చీతాలు మరణించాయని చెప్పడం.. శాస్త్రీయ ఆధారాలు లేని ఉహాగానాలు, ప్రచారం మాత్రమేనని వెల్లడించింది. చీతాల మరణాలకు గల కారణాలపై లోతుగా విశ్లేషించేందుకు సంబంధిత నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపింది.