న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు నేపథ్యంలో సీనియర్ కేంద్ర మంత్రులైన రవి శంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ కూడా తమ మంత్రి పదవులకు బుధవారం రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి వర్గం మెగా విస్తరణ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా తమ పదవులను వీడారు. ట్విట్టర్తో వివాదం, కొత్త ఐటీ రూల్స్పై అన్ని రంగాల నుంచి విమర్శలు రావడంతో రవి శంకర్ ప్రసాద్ను కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పించినట్లు సమాచారం.
మరోవైపు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్తోపాటు, కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్థన్, కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్, సదానంద గౌడ వంటి సీనియర్ నేతలు, కీలక మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.