Smriti Irani | కేంద్రమంత్రి స్మృతి ఇరాని కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె ఆదివారం రాత్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాజేంద్రనగర్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరుకాలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నానన్న కేంద్రమంత్రి.. తనకు కరోనా పాజిటివ్గా తేలిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు.
స్మృతి ఇరాని ఇంతకు ముందు 2020లో కరోనా వైరస్ బారినపడ్డారు. ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత ఐదు రోజుల్లో 12వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. గత 24 గంటల్లో 12,781 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 18 మంది కరోనాతో మృత్యువాతపడగా.. 8,537 మంది బాధితులు కోలుకున్నారు.