కోల్కతా: కేంద్ర మంత్రి శాంతను ఠాకూర్కు లష్కరే తాయిబా నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఎన్నార్సీని అమలుచేస్తే దేశం మొత్తాన్ని తగలబెడతామని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని అందులో హెచ్చరించారు. బెంగాలీ భాషలో రాసిన లేఖలో జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) అమలు తర్వాత ముస్లింలు హింసకు గురైనట్టయితే, మతువా కమ్యూనిటీ పవిత్ర స్థలమైన ఠాకూర్బారీని కూల్చేస్తామని బెదిరించారు. లేఖను చూసి షాక్ అయ్యానన్న మంత్రి వెంటనే తన శాఖకు సమాచారమిచ్చానన్నారు.
శాంతను ఠాకూర్పై ఎఫ్ఐఆర్
శాంతను ఠాకూర్పై పశ్చిమ బెంగాల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్వయంగా ఆయన అత్త, టీఎంసీ ఎంపీ అయిన మమతా బాలా ఠాకూర్ ఈ ఫిర్యాదు చేశారు. బోరోమా అని ముద్దు గా పిలుచుకునే కమ్యూనిటీ మెట్రియార్క్ బినాపాని దేవి ఐదేళ్ల క్రితం చనిపోయారు. ఆమె చనిపోయే వరకు నివసించిన ఇంటిని బలవంతంగా స్వాధీనం చేసుకోవటానికి యత్నించారన్నది అభియోగం. అయితే ఇదంతా నిరాధారమని మంత్రి కొట్టపారేశారు.