న్యూఢిల్లీ : తెలంగాణ మంత్రులపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నోరు పారేసుకున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం ముగిసిన అనంతరం కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ తెలంగాణ మంత్రులపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానించారు. నోటికొచ్చిన అబద్ధాలు చెప్తూ.. తెలంగాణ ధాన్యం గోల తప్ప, మాకు మరో పని ఉండదా..? అని కేంద్రమంత్రి అన్నారు. ఎందుకు ఢిల్లీలో పడి ఉన్నారు అంటూ తెలంగాణ మంత్రులపై కోపం చేశారు. అసలు ఢిల్లీకి ఎందుకొచ్చారు మీరు? మీకు పని, పాటా లేదా? నేను మిమ్మల్ని రమ్మన్నానా? మీరు ఎప్పుడు వస్తే అప్పుడు నేను కలవాలా? అని గోయల్ కసురుకున్నారు. ఎఫ్సీఐకి బియ్యం తరలింపులో తెలంగాణ విఫలమైందని గోయల్ రివర్స్ దాడి చేశారు.
తెలంగాణకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై అయోమయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లతో యాసంగిని ముడిపెడుతూ కిషన్ రెడ్డి మాట్లాడారు. ఎఫ్సీఐకి సరఫరాలో తెలంగాణదే తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. ఒప్పందం ప్రకారమే ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. వైఫల్యం ఎఫ్సీఐది కాదు.. తెలంగాణదే అంటూ కిషన్ రెడ్డి రివర్స్ ఆరోపణలు చేశారు.