ఢిల్లీ : కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. శనివారం నాడు ఆయన ఎయిమ్స్, నాగపూర్లో వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. మార్చి 6వ తేదీ గడ్కరీ తన మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ దంఖర్ కూడా ఈవాళ కమాండ్ హాస్పటల్లో కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. వైద్య సిబ్బందికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.