ముంబై, మే 2 (నమస్తే తెలంగాణ): కుల రాజకీయాలు చేస్తున్న వారిపై కేంద్ర మంత్రి నితిన్ గడరీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరైనా తనతో కుల ప్రస్తావన తెస్తే, వాడిని కొడతానని ఆయన అన్నారు. శుక్రవారం నాగ్పూర్లో మేడే సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చాలా మంది కుల, మతాల పేరుతో సమాజాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. అభివృద్ధి, సౌకర్యాల విషయంలో తనకు ఏ వర్గంపై ఎలాంటి వివక్ష లేదన్నారు. దేశాభివృద్ధిలో కార్మికులు చేసిన సేవలను గడ్కరీ ఈ సందర్భంగా ప్రశంసించారు.