హైదరాబాద్ : కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశంలో ఓ వైపు భారీగా కేసులు నమోదవుతుంటే..మరోవైపు వీఐపీలు, సెలెబ్రిటీలు వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది సినీతారలు, కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులు మహమ్మారి బారినపడ్డారు. నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, భానోత్ శంకర్ నాయక్ కొవిడ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
తాజాగా కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డికి సైతం కొవిడ్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తేలికపాటి లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేసుకోగా పాజిటివ్గా తేలినట్లు పేర్కొన్నారు. అవసరమైన ప్రోటోకాల్స్ను పాటిస్తూ హోం క్వారంటైన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా క్వారంటైన్లో ఉండాలని, కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు.