న్యూఢిల్లీ : పండగ సీజన్ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉచిత రేషన్ పధకాన్ని మరో మూడు నెలలు పొడిగించింది. భారతీయ రైల్వేలను అప్గ్రేడ్ చేసేందుకు రూ 10,000 కోట్లు ప్రకటించింది. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పధకాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని కేంద్ర క్యబినెట్ నిర్ణయించిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను కేంద్రం నాలుగు శాతం పెంచింది. ఏడో వేతన కమిసన్ సిఫార్సుల ఆధారంగా కేంద్రం డీఏ పెంపు చేపట్టింది. ఇక న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం రూ 10,000 కోట్లు వెచ్చించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది.