Hindenburg Report : అదానీ గ్రూప్పై ఏడాదిన్నర కిందట సంచలన ఆరోపణలు చేసిన మార్కెట్ రీసెర్చి కంపెనీ హిండెన్బర్గ్ తాజా ఆరోపణలు కలకం రేపుతున్నాయి. అదానీ గ్రూప్ అక్రమంగా నిధుల మళ్లింపునకు ఉపయోగించిన విదేశీ ఫండ్లలో సెబీ చీఫ్ మాధవి పురి బుచ్, ఆమె భర్త ధవళ్ బుచ్కు వాటాలున్నాయని లేటెస్ట్ రిపోర్ట్లో పేర్కొనడం దుమారం రేపుతోంది.
కాగా హిండెన్బర్గ్ నివేదికపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భగ్గుమన్నారు. గ్వాలియర్లో కేంద్ర మంత్రి ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని, దేశంలో అరాచకం వ్యాప్తి చేయడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. వివాదాస్పద వ్యవహారాల్లో దేశం నలిగిపోవాలని మాత్రమే ఆ పార్టీ కోరుకుంటుందని మండిపడ్డారు.
దేశాన్ని పురోగతి పధంలో, అభివృద్థి మార్గాన నడిపించాలని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రతి బీజేపీ కార్యకర్తా కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ ప్రతిష్టను దిగజార్చి ప్రతి ఒక్కరినీ చీకట్లో మగ్గేలా చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరి తొలి నుంచీ ఇదేనని, విచ్ఛిన్నకర విధానాలతోనే ఆ పార్టీ ముందుకెళుతున్నదని జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు.
Read More :
Shravya Varma | బ్యాడ్మింటన్ ప్లేయర్తో ప్రేమలో పడిన ఆర్జీవీ మేనకోడలు