న్యూఢిల్లీ, మార్చి 4: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్పై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు భంగం వాటిల్లేలా అశోక్ గెహ్లాట్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని కోర్టు సోమవారం విచారణ జరపనుంది.
సంజీవని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కుంభకోణంలో షెకావత్ పాత్ర ఉన్నదని అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. కాగా, తనపై షెకావత్ కేసు వేయడాన్ని స్వాగతిస్తున్నానని, ఈ కేసు ద్వారా ఈ కుంభకోణం గురించి దేశమంతా తెలుస్తుందని పేర్కొన్నారు.