IPS Parade | హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం 75వ బ్యాచ్ ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ట్రైనీ ఐపీఎస్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ దేశ భద్రతలో ఐపీఎస్లు పునరంకితంకావాలని పిలుపునిచ్చారు. దేశ అంతర్గత రక్షణలో పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తున్నదంటూ కితాబిచ్చారు.
సైబర్ నేరాలను అరికట్టడంలో, దేశానికి సేవ చేయడంలో ఐపీఎస్ను శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. ఏ ప్రాంతంలో విధులు నిర్వర్తించినా ఆ ప్రాంతం భాష, సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలన్నారు. ఇదిలా ఉండగా.. ఇక ట్రైనీ ఐపీఎస్ల పరేడ్ ఆద్యాంతం ఆకట్టున్నది. అనుష్తా కలియా పరేడ్ కమాండర్గా వ్యవహరించారు. పరేడ్ అనంతరం అమిత్షా ఇండోర్, అవుట్డోర్ విభాగాల్లో ప్రతిభ చూపిన ట్రైనీ ఐపీఎస్లకు బహుమతులు ప్రదానం చేశారు.
బెస్ట్ అవుట్డోర్ ప్రొహిబిషనర్గా అగ్మంట్ క్యాడర్కు చెందిన అనుష్తా కలియా, బెస్ట్ అవుట్డోర్ సబ్జెక్ట్లో కైలాష్ లింబు, బెస్ట్ లేడీ ప్రొహిబిషనర్ అవుట్ డోర్ ట్రైనింగ్లో సిమ్రాన్ భరద్వాజ్, టాంక్ కప్ విభాగంలో అంత్రిష్ జైన్, లా విభాగంలో ఇషాసింగ్, ఎన్సీఆర్బీ విభాగంలో అక్షయ్ ప్రమోద్, ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో ఇషాసింగ్, మదన్లు ట్రోఫీలు అందుకున్నారు.
బ్యాచ్ టాపర్ అనుష్తా కలియాకు హానర్ స్వార్డ్ను అమిత్షా ధరింపజేశారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, డీజీపీ అంజనీకుమార్, సీబీఐ, ఈడీ డైరెక్టర్లు, ఐఏఎస్ అధికారులు, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు, ట్రైనీ ఐపీఎస్ల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. పరేడ్ అనంతరం ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 5కే మారథాన్ను అమిత్ షా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 4 లక్షల మంది ఈ రన్లో పాల్గొన్నట్లు చెప్పారు.