JN.1 | న్యూఢిల్లీ : కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సూఖ్ మాండవీయ నేతృత్వంలో కరోనా ప్రభావిత రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మన్సూఖ్ మాండవీయ మాట్లాడుతూ.. కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1ను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. అయితే ఈ వైరస్పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జేఎన్.1 వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ, ప్రభావం తేలికపాటిగా ఉంటుందన్నారు. ప్రతి మూడు నెలలకో సారి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.
ఈ సందర్భంగా కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రతిరోజు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి, జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపుతున్నామని తెలిపారు. ఈక్విప్మెంట్స్, పీపీఈ కిట్స్ అందుబాటులో ఉంచామన్నారు.
కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 కేసును దేశంలో తొలిసారిగా డిసెంబర్ 8వ తేదీన కేరళలో గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,300 కేసులు యాక్టివ్గా ఉన్నాయన్నాని వైద్యాధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే 519 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
Union Health Minister Dr @mansukhmandviya virtually chaired a high level meeting with health Ministers of various states to access the current status and preparedness on COVID 19.
MoS (Health) Prof @spsinghbaghelpr and @DrBharatippawar, Health Minister of Uttarakhand Shri… pic.twitter.com/uigH7V8S4a
— Ministry of Health (@MoHFW_INDIA) December 20, 2023