న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రాజ్పథ్, సెంట్రల్ విస్టా లాన్ పేర్లను మార్చనున్నది. రాజ్పథ్ పేరును ‘డ్యూటీపథ్’గా మార్చనున్నట్లు సమాచారం. నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న రహదారిని ‘డ్యూటీపథ్’ పిలువనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 8న సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టు కింద విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు స్ట్రెచ్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
సెంట్రల్ విస్టా అవెన్యూలో రాజ్పథ్ వెంట రాష్ట్రాల వారీగా ఫుడ్స్టాల్స్, పచ్చదనం, గ్రానైట్ వాక్వేలు ఏర్పాటు చేశారు. వెండింగ్ జోన్లు, పార్కింగ్ స్థలాలు, రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ ఏర్పాటు నియమించనున్నారు. అయితే, ఈ సమయంలో ఇండియా గేట్ నుంచి మాన్సింగ్ రోడ్ వరకు ఉన్న గార్డెన్ ఏరియాలో తినడానికి అనుమతి ఉండదు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును కేంద్రం 2019లో ప్రకటించింది. డిసెంబర్ 10, 2020న ప్రధాని నరేంద్ర మోదీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇందులో త్రిభూకారంలో కొత్త పార్లమెంట్ భవనం, ఉమ్మడి కేంద్ర సచివాలయం, మూడుకిలోమీటర్ల రాజ్పథ్ రీడెవలప్మెంట్, ప్రధాని నివాసంతో పాటు కార్యాలయం, వైస్ ప్రెసిడెన్షియల్ ఎన్క్లేవ్ నిర్మిస్తున్నారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కిందట పార్లమెంట్ హౌస్ భవనం దాదాపు 65,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కేంద్రం నిర్మిస్తున్నది. ఇందులో పెద్ద రాజ్యాంగ మందిరం, ఎంపీల కోసం లాంజ్, లైబ్రరీ, పార్లమెంట్ కమిటీల కోసం ప్రత్యేకంగా గదులు, డైనింగ్ ఏరియా తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. లోక్సభలో 888 మంది సభ్యులకు, రాజ్యసభలో 384 మంది సభ్యులకు సీటింగ్ సామర్థ్యం ఉండనున్నది.