చెన్నై, ఏప్రిల్ 11: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు(సీయూఈటీ)ను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తమిళనాడు అసెంబ్లీ సోమవారం తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి బీజేపీ మిత్ర పక్షం అన్నాడీఎంకే కూడా మద్దతిచ్చింది. కేంద్రీయ వర్సిటీల్లోని యూజీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. సీయూఈటీ నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. కేవలం ఎన్సీఈఆర్టీ సిలబస్తోనే నిర్వహించే ఈ పరీక్ష.. రాష్ర్టాల బోర్డుల పరిధిలో చదువుకొన్న విద్యార్థుల అవకాశాలను దెబ్బతీస్తుందని తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఇది పిల్లలపై ఒత్తిడి పెంచుతుందని ఆరోపిస్తున్నది.