Union Budget | కేంద్ర ఆర్థికమంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) లోక్సభ (Lok Sabha) లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏకంగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె.. ఫార్మా విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో మూడు కొత్త విద్యా సంస్థలను స్థాపించినట్లు తెలిపారు. సంస్కరణలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 7 శాతం వృద్ధితో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
పవిత్ర మాఘపూర్ణిమ రోజున బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని, ప్రపంచ మార్కెట్లతో భారత్ను అనుసంధానిస్తున్నామని నిర్మలాసీతారామన్ అన్నారు. ఎగుమతులపై ఆధారపడటం తగ్గించుకున్నట్లు తెలిపారు. వికసిత భారత్లో భాగంగా యువత ఆకాంక్షలకు అద్దం పట్టేలా బడ్జెట్ను రూపొందించామని చెప్పారు. పేదలు, బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధి కోసం కేంద్రం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.
ఇది కర్తవ్యభవన్లో రూపొందించిన మూడో బడ్జెట్ అని ఆర్థిక మంత్రి చెప్పారు. నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకతతో భారత్ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తామని అన్నారు. అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉండేలా చూస్తామన్నారు. 2025 ఆగస్టు తర్వాత 350 సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆర్థిక ప్రణాళికలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉందన్నారు.
అదేవిధంగా జీఎస్టీ, లేబర్కోడ్ తదితర రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఛాంపియన్ ఎంఎస్ఎంఈ (MSME) ల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. రూ.10 వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయోఫార్మా శక్తి పథకం తీసుకొస్తున్నట్లు చెప్పారు.