న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర క్యాబినెట్ గుడ్ న్యూస్ వినిపించనున్నది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని మూడు శాతం పెంచినట్లు తెలుస్తోంది. కేంద్ర పెన్షర్లకు కూడా మూడు శాతం డీఏను పెంచనున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు దీనిపై కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటన చేయనున్నారు. డీఏను 17 నుంచి 28 శాతానికి పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మూడు శాతం పెంపుతో.. డీఏ 31 శాతానికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.