Union Budget 2023-24 | 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి డిజిటల్ పద్దును పార్లమెంట్కు సమర్పించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి. కాగా, 2022-23 బడ్జెట్లో కేంద్రం ఇచ్చిన హామీలు చాలా వరకు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వ గణాంకాలే బీజేపీ మోసపు హామీలను వెల్లడిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎవరికీ ఉపయోగపడని బడ్జెట్ అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం విమర్శించారు. బడ్జెట్ను బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు, ప్రజల సమస్యలు, ప్రజల జీవితాలు, ప్రజల జీవన విధానం, ధనికులు-పేదల మధ్య అసమానతల గురించి ఏమాత్రం పట్టింపు లేదనే విషయం అర్ధమవుతుందని ఆయన విమర్శించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో నిరుద్యోగం, పేదరికం, అసమానత్వం అనే పదాలను ఎక్కడా ప్రస్తావించలేదని చిదంబరం దుయ్యబట్టారు. ఈ బడ్జెట్తో పేదలకుగానీ, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకుగానీ, ప్రభుత్వానికి పన్నులు కడుతున్న మధ్యతరగతి ప్రజలకుగానీ, గృహిణులకుగానీ ఎలాంటి ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు.
కేంద్ర బడ్జెట్ పూర్తిగా రైతులకు, పేదలకు వ్యతిరేకంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకానికి, పేదల ఆహార భద్రత కార్యక్రమానికి నిధుల్లో దాదాపు 30 శాతం కోత విధించడాన్ని మంత్రి తప్పుబట్టారు.
ఎరువుల సబ్సిడీని తగ్గించి రైతులపై అదనపు భారం మోపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణపై ఎప్పటిమాదిరిగానే నిర్లక్ష్యం చూపారన్నారు. పేదలకు మాత్రం అన్యాయం చేస్తూ, కార్పొరేట్లకు మాత్రం అనుకూలంగా బడ్జెట్ను రూపొందించారని చెప్పారు. బీజేపీ హయాంలో ఇప్పటికే రికార్డు స్థాయి అప్పులు చేశారని, ఈ ఏడాది దేశాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టాలని చూడడం దురదృష్టకరమన్నారు.
సామాన్యులకు ఆసరాగా నిలవాల్సింది పోయి వారికి అందించే సంక్షేమ పధకాలు, సబ్బిడీల్లో కోత విధించారని నిర్మల బడ్జెట్పై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. దారిద్ర్య రేఖ ఎగువకు చేరిన వారు సైతం మోదీ సర్కార్ నిర్వాకంతో తిరిగి దారిద్ర్య రేఖకు దిగువన పడిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎనిమిదేండ్ల బడ్జెట్ల తరహాలోనే ప్రస్తుత బడ్జెట్ కూడా ఉందని పన్నులు పెంచారని దుయ్యబట్టారు. సంక్షేమ పధకాలు, సబ్సిడీలపై ఖర్చు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘దేశంలో మునుపటిలాగా.. గత 9 సంవత్సరాలలో కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లు వస్తూనే ఉన్నాయి. బడ్జెట్లో ప్రకటనలు, వాగ్దానాలు, వాదనలు, ఆశల వర్షం కురిపించారు. అయితే భారతదేశంలోని మధ్యతరగతి వర్గం వారు ద్రవ్యోల్బణం, పేదరికాన్ని ఎదుర్కోవడం మొదలుపెట్టినప్పుడు అవన్నీ అనవసరంగా మారాయి. నిరుద్యోగం మొదలైన కారణాల వల్ల దిగువ మధ్యతరగతి చాలా విచారంగా మారింది’ అని మాయావతి ట్వీట్ చేశారు.
యూపీలోని మెయిన్పురికి చెందిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ కూడా బడ్జెట్పై స్పందించారు. ‘ఈ బడ్జెట్ను ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టినట్లుగానే కనిపిస్తున్నది. మధ్యతరగతి వారికి కొంత సడలింపు ఇచ్చినప్పటికీ.. రైతులకు, ఉపాధికి, యువతకు ప్రభుత్వం ఏమీ చెప్పలేదు. ఈ బడ్జెట్లో రైల్వేలను కూడా విస్మరించారు. ఇది నిరాశాజనకమైన బడ్జెట్’ అని డింపుల్ యాదవ్ కామెంట్ రాశారు.
నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బుధవారం దశదిశా లేని బడ్జెట్ను ప్రవేశపెట్టారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పెదవివిరిచారు. రాబోయే మూడు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్ను రూపొందించిందని దుయ్యబట్టారు. పేదల కష్టాలు తొలగించేందుకు, ధరలను నియంత్రించేందుకు బడ్జెట్లో ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్లో సమర్పించిన బడ్జెట్పై ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. అసలు ఆదాయమే లేదు, పన్ను మినహాయింపుల వల్ల ప్రజలు ఎలా ప్రయోజనం పొందుతారు? అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం పరిష్కరించడం లేదని విమర్శించారు. పేదలకు కేవలం హామీలు, మాటలే మిగిలాయని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. బడా పారిశ్రామికవేత్తలకే లబ్ధి కలిగించేలా ఈ బడ్జెట్ ఉందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్పై తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు శతృఘ్న సిన్హా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. బడ్జెట్ ఆసాంతం ‘మేం ఇద్దరం, మాకు ఇద్దరు’ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లుగా ఉందని ఆయన విమర్శించారు. దేశంలోని మధ్య తరగతి ప్రజానీకానికి ఈ బడ్జెట్తో ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు.
కేవలం వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర బడ్జెట్ రూపొందించినట్లుగా కనిపిస్తున్నదని, మధ్య తరగతి ప్రజల కోసం ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో ప్రస్తావించింది ఏమీ లేదన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కోసం ప్రభుత్వం గరిష్ఠ స్లాబ్ను తగ్గించిందని, ఇది ఎవరికి మేలు చేయడానికని ఆయన ప్రశ్నించారు. హయ్యస్ట్ ట్యాక్స్ స్లాబ్ను ఎవరి కోసం తగ్గించారో ప్రజలు బాగా అర్థం చేసుకోగలరని సిన్హా పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వచ్చినప్పటి నుంచి దేశంలోని మహిళలు సంతోషించారు. ఇంత పెద్ద దేశానికి విత్తమార్గదర్శనాలు చేయడమే కాకుండా తమను కూడా గుర్తుపెట్టుకుంటారని భావించారు. ఐదోసారి గడిచిపోయినా మళ్లీ భంగపడిపోయామని వారు నిట్టూరుస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో మహిళల భద్రతకు అతి తక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. జెండర్ బడ్జెట్లో 9 రాష్ట్రాల ఊసే కనిపించడం లేదు. దీనినే ఓ ఆర్థికవేత్త ‘ఒంటె నోట్లో జీలకర్ర మాదిరి..’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత బడ్జెట్లో కేవలం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చి మహిళల్ని సంతోషపెట్టే ప్రయత్నం చేశారు.
కేంద్ర బడ్జెట్ కొన్ని రాష్ట్రాలకు చెందిన బడ్జెట్లా ఉందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మోదీ ప్రభుత్వం విఫలం అయ్యిందనడానికి ఈ బడ్జెటే ఊదాహరణ అని ఆమె అన్నారు. 10 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పిస్తారని ఆశించామని, ఎందుకంటే తెలంగాణలో ఉద్యోగులకు మంచి జీతాలు ఇస్తున్నామని, ప్రస్తుతం మంత్రి ప్రకటించిన రిబేట్ ఎవరికీ ఉపయోగపడదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగా.. 1 గంట 26 నిమిషాల పాటు కొనసాగింది. సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఐదోసారి. ఇది మూడో పేపర్ లెస్ బడ్జెట్.
ఆదాయ పన్ను మినహాయింపు రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంపు. రూ. 9 లక్షల వరకు 5 శాతం పన్ను. రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు 15 శాతం పన్ను. రూ. 12 నుంచి రూ. 15 లక్షల వరకు 20 శాతం పన్ను. రూ. 15 లక్షలు దాటితే 30 శాతం పన్ను చెల్లించాలి.
రూ. 7 లక్షల వరకు ఆదాయం ఉన్న వేతన జీవులకు ఊరట. రూ. 7 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు.
చిరు వ్యాపారులకు కూడా పాన్ కార్డు తప్పనిసరి. ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు కూడా పాన్ కార్డు తప్పనిసరి.
మొబైల్ ఫోన్లు, కెమెరాలు, టీవీలు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు, కిచెన్ చిమ్నీలు..
సిగరెట్ల ధరలు, ఇంపోర్టెడ్ రబ్బర్, బట్టలు, బంగారం, వెండి, సిమెంట్.. వాహనాల టైర్ల ధరలు.
అత్యాధునిక సాంకేతికత నేర్చుకోవడానికి యువతకు ప్రోత్సాహం. నాలుగో పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు.
కోస్తాలో మడ అడవుల అభివృద్ధికి మిస్టీ పేరుతో ప్రత్యేక పథకం. రాంసార్ చిత్తడి నేలలు, సరస్సుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు. రాంసార్ ప్రాంతాల్లోని స్థానికులకు టూరిజం, ఉపాధి కల్పనలో ప్రాధాన్యం ఇస్తాం.
మొబైల్స్, టీవీలు, కెమెరాల విడి భాగాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు. జౌళి మినహా కస్టమ్స్ డ్యూటీలు 21 నుంచి 13 శాతానికి తగ్గింపు. కిచెన్ చిమ్నీలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.
మహిళలు, బాలికల కోసం మహిళా సమ్మాన్ బచత్ పత్ర పథకం ప్రారంభం. 2025 వరకు అమల్లో ఉండనున్న మహిళా సమ్మాన్ బచత్ పత్ర పథకం. సీనియర్ సిటిజన్స్ డిపాజిట్ పరిమితి రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంపు.
జీడీపీలో ద్రవ్యలోటు 5.9 శాతం ఉండే అవకాశం. 2025-26 నాటికి ద్రవ్యలోటు 4.5 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యం. బహిరంగ విపణి నుంచి రూ. 15.43 లక్షల కోట్ల అప్పులు.
కృత్రిమ వజ్రాలపై పరిశోధన చేసే ఐఐటీలకు ప్రత్యేక గ్రాంట్లు. కృత్రిమ వజ్రాలకు కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.
కాలం చెల్లిన వాహనాల తొలగింపు మా తక్షణ ప్రాధాన్యం. కేంద్ర ప్రభుత్వ వాహనాలు మార్చేందుకు ప్రత్యేక నిధులు. కొత్త వాహనాల కొనుగోలుకు రాష్ట్రాలకు సాయం అందిస్తాం. వాహనాల తుక్కు కోసం మరిన్ని నిధులు కేటాయింపు.
నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్కు రూ. 19,700 కోట్లు కేటాయింపు. విద్యుత్ రంగానికి రూ. 35 వేల కోట్లు. ఏడాదికి అర్బన్ ఇన్ఫ్రా ఫండ్ రూ. 10 వేల కోట్లు. గోబర్దన్ స్కీం కింద 200 బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు. లడాఖ్లో 13 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు. ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం రూ. 38 వేల కోట్లు. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం.
ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు కేటాయింపు. కర్ణాటకలోని వెనుకబడ్డ ప్రాంతాలకు, సాగునీటి రంగానికి రూ. 5,300 కోట్లు.
ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ. 7 వేల కోట్ల నిధులు. ఎంఎస్ఈలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలకు డిజిలాకర్ సేవల విస్తరణ. 5జీ సేవల యాప్ల అభివృద్ధికి వంద పరిశోధనా సంస్థలు. 50 ఎయిర్పోర్టుల పునరుద్ధరణ. ట్రాన్స్పోర్టు రంగానికి ప్రాధాన్యతన. క్లీన్ ప్లాంట్ కార్యక్రమానికి రూ. 2 వేల కోట్లు. మూడు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్లు. వ్యాపార సంస్థలకు ఇకపై పాన్ కార్డు ద్వారానే గుర్తింపు.
1. సమ్మిళిత అభివృద్ధి
2. చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందడం
3. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు
4. యువశక్తి
5. గ్రీన్ గ్రోత్
6. ఆర్థిక రంగం బలోపేతం
7. వనరులను వాడుకోవడం
రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు. వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ. 13.7 లక్షల కోట్లు. కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ. 75 వేల కోట్లు. బడ్జెట్లో మూలధన వ్యయం మొత్తం రూ. 10 లక్షల కోట్లు.
రైల్వేలకు రూ. 2. 4 లక్షల కోట్లు. 2013-14తో పోల్చితే రైల్వేలకు 9 రెట్ల నిధులు అధికం.
81 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు చేయూత. సామాన్యుల సాధికారతే బడ్జెట్ లక్ష్యం. నేషనల్ డిజిటల్ లైబ్రరీని ప్రోత్సాహిస్తాం. దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు. దేశంలోని 63 వేల వ్యవసాయ పరపతి సంఘాల డిజిటలైజేషన్. దీని కోసం రూ. 2 వేల కోట్లు కేటాయింపు. హరిత అభివృద్ధి దిశగా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాం.
పీవీటీజీ గిరిజనుల కోసం ప్రత్యేక చర్యలు. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ది కోసం రూ. 15,000 కోట్లు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు. ఏకలవ్య పాఠశాలల్లో 38,800 ఉపాధ్యాయులు నియామకం. పీఎం ఆవాస్ యోజనకు రూ. 79 వేల కోట్లు కేటాయింపు.
సికెల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చేయూత. ప్రయివేటు, ప్రభుత్వ పరిశోధనల కోసం ఐసీఎంఆర్ ల్యాబ్స్. ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం. 11.7 కోట్ల మందికి ఉచితంగా టాయిలెట్స్ నిర్మించి ఇచ్చాం. చిరు ధాన్యాల పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు. విద్యార్థులకు చదువు ఆసక్తి పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు. ప్రాంతీయ భాషల్లో ఎన్బీటీ ద్వారా మరిన్ని పుస్తకాలు.
బడ్జెట్లో ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాం. మహిళలు, రైతుల, యువత, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాం.
పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేలా సంస్కరణలు. వ్యవసాయ రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రణాళిక. మత్స్యకారుల అభివృద్ధి కోసం మరిన్ని కేటాయింపులు. వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు. 63 వేల వ్యవసాయ పరపతి సంఘాల డిజిటలైజేషన్, రూ. 2 వేల కోట్లు కేటాయింపు.
2047 లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నాం. భారత్లో డిజిటల్ యూపీఐ చెల్లింపులు భారీగా పెరిగాయి. ఈపీఎఫ్వోలో సభ్యుల సంఖ్య రెట్టింపు అయింది. మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నాం. ఆత్మనిర్భర్ భారత్తో చేనేత వర్గాలకు లబ్ధి చేకూరింది. గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుంది. వంద కోట్ల మంది 220 కోట్ల డోసులను అందించాం.
తొమ్మిదేండ్లలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాం. తొమ్మిదేండ్లలో తలసరి ఆదాయం రెట్టింపు అయింది. ప్రపంచ సవాళ్లను భారత్ ఆర్థిక వ్యవస్థ దీటుగా ఎదుర్కొని నిలబడింది. జీ20 అధ్యక్ష బాధ్యతలతో భారత్ కీలక ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగుతోంది. కొవిడ్ సమయంలోనూ ఎవరూ ఆకలితో బాధపడకుండా చూశాం.
ప్రస్తుత ఏడాదికి 7 శాతం వృద్ధి నమోదని ఆర్థిక సర్వే అంచనా వేసింది. దేశం వృద్ధి రేటు శరవేగంగా పెరుగుతోంది. భారత్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ కాపీని ఆర్థిక మంత్రి చదివి వినిపిస్తున్నారు. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్.
2023-24 బడ్జెట్కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
కేంద్ర బడ్జెట్ 2023-24ను ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బహీఖాతా ట్యాబ్లెట్తో .. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కృష్ణారావ్ కరడ్, ఆర్ధిక శాఖ అధికారులు కూడా రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. ఎరుపు రంగు బహీఖాతాతో మంత్రి కనిపించారు.
Union Budget 2023-24 | 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం మరికాసేపట్లో ప్రవేశపెట్టనున్నది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి డిజిటల్ పద్దును పార్లమెంట్కు సమర్పించనున్నారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి. కాగా, 2022-23 బడ్జెట్లో కేంద్రం ఇచ్చిన హామీలు చాలా వరకు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వ గణాంకాలే బీజేపీ మోసపు హామీలను వెల్లడిస్తున్నాయి.