రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాలో దారుణం జరిగింది. ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి, చిన్నాన్నలే ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. మళ్లీమళ్లీ మానవ మృగాలు దుర్మార్గానికి పాల్పడుతుండటంతో భరించలేక ఆరేండ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయారు. తండ్రి మిస్సింగ్ కేసు పెట్టడంతో ఇటీవల పోలీసులు వారి జాడను గుర్తించి తీసుకొచ్చారు.
అయితే, వాళ్లు పారిపోవాల్సి రావడానికిగల కారణాలను పోలీసులకు వివరించడంతో.. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 2017లో బాధితులపై లైంగిక వేధింపులు మొదలయ్యాయి. అప్పటికి అక్కకు వయసు 17 సంవత్సరాలు, చెల్లెలి వయసు 16 సంవత్సరాలు.
వాళ్ల తల్లికి మతిస్థిమితం లేకపోవడంతో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ తరచూ తన చిన్నమ్మ ఇంటికి వెళ్లేవారు. అక్కడ వాళ్ల చిన్నమ్మలేని సమయంలో చిన్నాన్న అత్యాచారానికి పాల్పడేవాడు. ఇది భరించలేక విషయాన్ని తమ తండ్రికి చెప్పగా.. రక్షణ కల్పించాల్సిన తండ్రి కూడా వాళ్లనే దూషించి, తర్వాత అతను కూడా వాళ్లపై అత్యాచారానికి పాల్పడటం మొదలుపెట్టాడు.
దాంతో బాధితురాళ్లు విసిగిపోయారు. ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకుని పారిపోయారు. అనంతరం వాళ్ల తండ్రి తాను ఏమీ ఎరగనట్టే పోలీస్స్టేషన్కు వెళ్లి తనబిడ్డలు ఇద్దరూ మిస్సయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎట్టకేలకు బాధితురాళ్ల జాడ దొరకడంతో నిందితుల బండారం బయటపడింది.